‘అసెంబ్లీ నీ అబ్బ సొత్తు కాదు’.. పొంగులేటిపై వద్దిరాజు సీరియస్

-

ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)పై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(Vaddiraju Ravichandra) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వద్దిరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ గేట్‌ నీ అబ్బ సొత్తు కాదు.. బరాబర్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారు. నీకో రాజకీయ జెండా లేదు.. ఎజెండా లేదు.. అమాయకులైన నలుగురు నాయకులను వెంటేసుకుని తిరుగుతున్నావు. వాళ్లను రాజకీయంగా అన్యాయం చేయడం తప్ప ఏమీ ఉండదు. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) ఇచ్చిన అవకాశాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేసుకున్నావు.. కానీ అదే క్రమంలో ఆర్థికంగా లాభపడ్డావు. అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) టికెట్‌లు ఇచ్చిన వారిని ఓడించడానికి కుయుక్తులు పన్నావు. అయినా కేసీఆర్ ఓపికతో ఎదురు చూశారు. కానీ నీలో మార్పు రాలేదు. ఇటుక, ఇటుక పేర్చి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని శక్తి వంతంగా చేశారు. ఈ పార్టీని ఓడించడం ఎవరి తరం కాదు.’’ అంటూ వద్దిరాజు(Vaddiraju Ravichandra) సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
Read Also: సెల్ఫీలకు రూ.500 అడిగిన కేటీఆర్.. పర్లేదంటూ యువత ఫోటోలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...