Asaduddin Owaisi | ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడుతారు.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

-

దేశ ప్రజల సంపదను దోచుకుని చొరబాటుదారులకు కాంగ్రెస్ పంచిపెట్టాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. దేశంలోనే మోదీ పెద్ద అబద్ధాల కోరు అని.. ఇంకెంతకాలం ముస్లింల పట్ల భయాన్ని సృష్టిస్తారని మండిపడ్డారు. తమ మతం వేరు కానీ తాము కూడా భారతీయులం అని స్పష్టంచేశారు.

- Advertisement -

‘ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారనే భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? మోదీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గింది. ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడతారు, ఇలా చెప్పడానికి నాకు సిగ్గుగా లేదు… ముస్లింలు మెజారిటీ వర్గం అవుతారని నరేంద్ర మోదీ హిందువులలో భయాన్ని పెంచుతున్నారు. ఎంతకాలం ముస్లింల పట్ల భయాన్ని సృష్టిస్తారు? మా మతం వేరు కానీ మేము భారతీయులం’ అని ఒవైసీ పునరుద్ఘాటించారు.

కాగా ఏప్రిల్ 21న రాజస్థాన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ(Modi).. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ పార్టీ మన తల్లులు, చెల్లెళ్ల మెడలో మంగళసూత్రాలను లాగేసుకుంటారు.. దేశ ప్రజల ఆస్తిని లాక్కుని ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు.. చొరబాటుదారులకు పంచుతారు.. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము, చొరబాటుదారులకు వెళ్లాలా?’ మోదీ ప్రజలను ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. తాజాగా అసదుద్దీన్ కూడా మోదీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. మరి ఒవైసీ(Asaduddin Owaisi) వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తారో లేదో చూడాలి.

Read Also: కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ కుమారుడు అమిత్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...