ఏ పార్టీలో చేరబోయేది అప్పుడే ప్రకటిస్తా: మాజీ ఎంపీ పొంగులేటి

-

Ponguleti Srinivas Reddy |ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అసంతృప్త నేత పొంగులేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తన అనుచరులతో భద్రాచలం పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ… భద్రాచలం ఆలయ అభివృద్ధికి వందకోట్లు ఇస్తామని చెప్పిన సీఎం కనీసం 100 రూపాయలు కూడా హుండీలో వేయలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఒకే ఒక్కసారి రాముల వారికి తలంబ్రాలు తీసుకొచ్చారని.. రాముడు మీద కేసీఆర్‌కు ఉన్న గౌరవం అది అంటూ శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు.

- Advertisement -

పోడు భూముల్లో గిరిజనులకు ఒక్క ఎకరం కూడా పట్టా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు గుర్తుకొస్తాయన్నారు. కొందరి స్వార్థం వల్ల పోటీ పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని.. విద్యార్ధులకు అన్యాయం జరిగినా కమిషన్ సభ్యులను ఎందుకు బర్తరఫ్ చేయలేదని పొంగులేటి ప్రశ్నించారు. పార్టీ ఏదైనా సరే.. కేసీఆర్ గద్దె దించడమే తన లక్ష్యమని.. త్వరలోనే ఏ పార్టీలో చేరే అంశంపై నిర్ణయం ప్రకటిస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) తెలిపారు. అభిమానుల కోరిక మేరకే నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Read Also: ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం: కేటీఆర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...