ప్రధానికి లెటర్ రాసే నైతిక హక్కు కేసీఆర్ కోల్పోయారు’

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి(Ponguleti Sudhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం బండి సంజయ్ చేపట్టిన దీక్షలో ఆయన పొంగులేటి ప్రసంగించారు. ఎనిమిదేళ్ల నుంచి రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని విమర్శించారు. అధివృద్ధి పేరిట రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నిలువునా దోచుకుంటోందని మండిపడ్డారు. కుక్కల దాడిలో చిన్నారు, ర్యాగింగ్‌కు బలవుతున్న యువతులకు రాష్ట్రంలో న్యాయం జరుగడం లేదని అన్నారు. మహిళలపై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుతానన్న కేసీఆర్.. అత్యాచారాలు పెరిగిపోయినా ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఏడు వందల మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉందంటే అది తెలంగాణలో కేసీఆర్ పాలన గొప్పతనం అని సెటైర్లు వేశారు. ఓట్ల రాజకీయం చేసే కేసీఆర్ ప్రధాని మోడీకి లెటర్ రాసే నైతిక హక్కు కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
Read Also: మహిళా ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...