Puvvada Ajay | తెలంగాణ కాంగ్రెస్ నేతలు అవకాశవాదులు: మంత్రి పువ్వాడ

-

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అంటేనే స్కాంల పార్టీ అన్నారు. ఆ పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు. తెలంగాణకు (Telangana) ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో కాంగ్రెస్‌లో చేరినవారంతా అవకాశ వాదులేనని చెప్పారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) మెచ్యూరిటీ లేని లీడరని విమర్శించారు. నాయకత్వం వద్దని పక్కకు జరిగిన నేత రాహుల్ అని చెప్పారు. కాంగ్రెస్‌ను నట్టేట ముంచి పక్కకు జరిగిన నేత ఖమ్మం వచ్చి మాట్లాడారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం పోటీ ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. అక్కడ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా అని నిలదీశారు. ఆ పార్టీ నేతల ఇండ్లపై ఐటీ, ఈడీ రైడ్లు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో భూమి నుంచి ఆకాశం వరకు అన్నింట్లో కుంభకోణమేనని పువ్వాడ(Puvvada Ajay) ఆరోపించారు.

- Advertisement -
Read Also:
1. కేసీఆర్ తెలంగాణకు రాజులా ఫీలవుతున్నాడు: రాహుల్ గాంధీ
2. మాది బీటీమ్ కాదు ఢీ టీమ్.. రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...