రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy |కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. 2019లో కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో ఇటీవల గుజరాత్‌లోని సూరత్ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి రెండేండ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని లోక్‌సభలో అనర్హత వేటు వేసినట్లు ఆ ప్రకటనలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్పష్టం చేశారు. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్(Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. మోడీ మధ్యయుగంలో చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయశారని ధ్వజమెత్తారు. అదానీ-మోడీ చీకటి స్నేహంపై నిలదీయడం, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. రాజకీయ విమర్శలను వ్యక్తిగత కక్షగా తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జైలు శిక్ష అమలు చేయకుండా కోర్టే 30 రోజులు గడువు ఇచ్చిందని అలాంటప్పుడు లోక్‌సభ ఎలా చర్యలు తీసుకోవడంపై మండిపడ్డారు. ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్య అని అభివర్ణించారు. దీనిపై దేశ వ్యాప్తంగా న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Read Also: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. MP సభ్యత్వాన్ని రద్దుచేసిన లోక్‌సభ

Follow us on: Google News  Koo  Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here