మహారాష్ట్ర వ్యక్తిని CMO లో ఎలా నియమిస్తారు? : రేవంత్ రెడ్డి

-

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని బీఆర్ఎస్‌లో చేర్చుకుని సీఎంఓలో ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. మహారాష్ట్రకు చెందిన శరత్ మర్కట్‌ను ఇటీవల బీఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్(KCR).. సీఎం కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీ(Private Secretary)గా నియమించారని ఆరోపించారు. అతడికి నెలకు లక్షా యాభై వేల జీతం ఇచ్చి ప్రైవేట్ సెక్రటరీగా పెట్టుకున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. ఈ జీవో పబ్లిక్ డొమైన్‌లో ఎక్కడా లేదని చెప్పారు. పరాయి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి పార్టీ కోసం ప్రజల సొమ్మును వినియోగిస్తుండని విమర్శించారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మహారాష్ట్రకు చెందిన వాళ్లకు జాబులిస్తుండని ధ్వజమెత్తారు రేవంత్(Revanth Reddy). జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

- Advertisement -
Read Also: కాంగ్రెస్ హయాంలో కరెంట్ వస్తే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త: KTR

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...