TSPSC సభ్యులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరులే: RSP

-

RS Praveen Kumar |టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓయూ విద్యార్థులతో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్‌పీ మాట్లాడుతూ.. తాను చెప్పేవరకు కమిషన్‌లో పనిచేస్తూ పరీక్ష రాసిన నిందితులను అరెస్టు చేయలేదని, తాను మాట్లాడేవరకు చిన్న విషయంగా చూసేవారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

బీఆర్ఎస్(BRS) నాయకులు లీకులు సాధారణమైన విషయం అంటున్నారని, తాను సెక్రటరీగా ఉన్నపుడు ఎక్కడా లీకులు కాలేదన్నారు. మోండా మార్కెట్ కంటే దారుణంగా ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని, హనీట్రాప్, హ్యాకింగ్ అంటూ పక్కదోవ పట్టించే కుట్ర చేశారని విమర్శించారు. TSPSCలోనే 10 మంది టాప్ మార్కులు తెచ్చుకున్నారని, దొంగలంతా కమిషన్ ఆఫీసులోనే ఉన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ఆరోపించారు. ప్రస్తుత TSPSC సభ్యులంతా ముఖ్యమంత్రి అనుచరులు, సన్నిహితులేనని ఆయన ఆరోపించారు.

Read Also: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కి మంత్రి KTR లీగల్ నోటీసులు

Follow us on: Google News  Koo Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...