TSPSC పేపర్ లీకేజిలో ఆ విషయం తేల్చేసిన సిట్

TSPSC Paper Leak

TSPSC Paper Leak |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు TSPSC ఉద్యోగులు ఉన్నట్లు సిట్ అధికారులు తేల్చారు. మార్చి 23 న అరెస్టైన ముగ్గురిలో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులుగా సిట్ అధికారులు నిర్ధారించారు. వీరిలో A1 గా ప్రవీణ్, A2 గా రాజశేఖర్ రెడ్డి, A10 గా షమీమ్, A12 గా రమేష్ ల పేర్లను సిట్ అధికారులు రిమాండ్ ఛార్జ్ షీట్ లో చేర్చారు.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులు నలుగురు పేపర్ లీకేజీ(TSPSC Paper Leak)లో నిందితులు ఉన్నట్లు పేర్కొన్న అధికారులు.. 19 మందిని విచారించారు. అందులో శంకర లక్ష్మి  తో పాటు.. టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా పేర్కొన్నారు సిట్ అధికారులు. కర్మన్ ఘాట్‌లోని ఒక హోటల్‌ యజమానిని, ఉద్యోగిని సాక్షులుగా పేర్కొన్నారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్‌లను అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.

Read Also: TSPSC సభ్యులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరులే: RSP

Follow us on: Google News  Koo  Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here