దశాబ్ది ఉత్సవాల వేళ TSRTC ఉద్యోగులకు శుభవార్త

TSRTC

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(DA) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్(Bajireddy Govardhan Reddy), సంస్థ ఎండీ సజ్జనార్(Sajjanar) వెల్లడించారు. జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది.’’ అని టీఎస్ఆర్టీసీ(TSRTC) చైర్మన్,బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Read Also:
1. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
2. పెళ్లి పీటలెక్కబోతున్న మెగా హీరో.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here