సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ.. ఎందుకంటే?

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాల కారణంగా పంటనష్టపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిన్నట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని అన్నారు. దాదాపు 13 జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మొక్కజొన్న, శనగ, మిర్చి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. 40వేల ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నదని పేర్కొన్నారు.

- Advertisement -

ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటి వరకు సమగ్ర పంటల బీమా పథకాన్ని రూపొందించకపోవడం సిగ్గుచేటని బండి(Bandi Sanjay) విమర్శలు చేశారు. పంటనష్టం తేల్చే విషయంలో రాష్ట్ర పభుత్వ చర్యలు ఉదాసీనంగా ఉన్నాయని చురకలంటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్‌ బీమా పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తే రైతులకు వెంటనే పరిహారం అందించే వీలుండేదని, కానీ కేంద్రానికి పేరొస్తుందనే అక్కసుతో ఈ పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేయకపోవడం వల్ల రైతులు నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు.

Read Also: ఈడీ ఆఫీస్ కు చేరుకున్న కవిత

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు...