Telangana BJP | ఎమ్మెల్యే ఈటల, ఎంపీ అర్వింద్‌కు భద్రత పెంపు

-

Telangana BJP | ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender), ధర్మపురి అర్వింద్‌(Arvind Dharmapuri)కు కేంద్రం ప్రభుత్వం భద్రతను పెంచింది. ఇద్దరిరి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌తో పాటు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించనుంది. ఈటల రాజేందర్‌కు వై ప్లస్(Y Plus) కేటగిరి, ధర్మపురి అర్వింద్‌కు వై కేటగిరి భద్రతను కేంద్రం కేటాయించింది. ఇటీవల ఈటల రాజేందర్ తనకు ప్రాణహాని ఉందని.. తనను చంపేందుకు రూ.20 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్(Padi Kaushik Reddy) రెడ్డి తనను చంపేందుకు చూస్తున్నారని ఈటల ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో ఈ భద్రతను పెంచినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Telangana BJP | మరోవైపు గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రెండుసార్లు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఓసారి ఆయన నివాసాన్ని కూడా ముట్టడించారు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన ధర్మపురి అరవింద్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), బీజేపీ ఛీఫ్ నడ్డా(JP Nadda)ను కలిసి జరిగిన సంఘటనలను వివరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ ఆయనకు వై కేటగిరి భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: ఇకపై అలా జరగడానికి వీళ్లేదు.. టీ-బీజేపీ నేతలకు నడ్డా స్వీట్ వార్నింగ్

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...