సోనియా గాంధీ, ఖర్గేతో టీకాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. టార్గెట్ అదే!

-

ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) దూకుడు పెంచింది. సభలు, డిక్లరేషన్లతో హైస్పీడ్ మెయింటైన్ చేస్తోంది. ఈ క్రమంలోనే అగ్రనాయకులు రాష్ట్ర పర్యటనలను సైతం ఖరారు చేస్తోంది. తాజాగా.. ఈ నెల 26 చేవెళ్లలో ప్రజా గర్జన నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) చీఫ్​ గెస్టుగా వస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 29న మైనారిటీ డిక్లరేషన్(Minority Declaration) రిలీజ్ చేస్తామన్నారు. అంతేగాక సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో ఓబీసీ డిక్లరేషన్(OBC Declaration) విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సభకు కర్ణాటక సీఎం హాజరవుతారన్నారు.

- Advertisement -

ఇక ప్రియాంక(Priyanka Gandhi) చేతుల మీదుగా మహిళా డిక్లరేషన్(Women Declaration) ను ప్రకటిస్తామన్నారు. ఈ రెండింటి కొరకు ఇప్పటికే పార్టీ కమిటీలను ఏర్పాటు చేసిందని, అంశాలను కూడా ఫైనల్ చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత పార్టీ మ్యానిఫెస్టోను సోనియ గాంధీ(Sonia Gandhi) చేతుల మీదుగా వెల్లడిస్తామన్నారు. ఇక ఈ నెల 21 నుంచి 25 వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Telangana Congress | ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను విజయవంతం చేయాలన్నారు.ప్రతీ గడపకు చేరాలి…ప్రతీ తలుపు తట్టేలా కాంగ్రెస్ ను చేరవేయాలన్నారు. ఇప్పటికే పార్లమెంట్ వారీగా కోఆర్డినెటర్లను నియమించామన్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

Read Also: రష్యాకు భారీ షాక్.. జాబిల్లిపై కూలిపోయిన లూనా-25 ల్యాండర్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KCR కు బిగ్‌ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది....

Chandrababu | వంగవీటి రాధాపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు....