తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టివేత.. ఎంతంటే..?

-

Telangana Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికారుల తనఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటివరకు మొత్తం రూ.1750కోట్ల అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతులు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపింది.

- Advertisement -

Telangana Elections | తెలంగాణలో అత్యధికంగా దాదాపు రూ.659 కోట్ల మేర సీజ్ చేసినట్లు పేర్కొంది. రాజస్థాన్‌లో రూ.650.7 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.323.7 కోట్లు, ఛత్తీస్ గఢ్‌లో రూ.76.9 కోట్లు సీజ్ చేసినట్లు వెల్లడించింది. కాగా 2018లో జరిగిన ఎన్నికల సమయంతో పోలిస్తే వీటి విలువ దాదాపు ఏడు రెట్లు ఎక్కువని చెప్పింది. గత ఎన్నికల్లో కేవలం రూ.239.15 కోట్లు పట్టుబడగా.. ఈసారి ఏకంగా రూ.1760కోట్లు అక్రమంగా పట్టుబడినట్లు ప్రకటించింది.

ఇక ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఈ నెల 25న రాజస్థాన్‌లో, 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తనిఖీల సందర్భంగా తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణలో సీజ్ చేసిన నగదు మొత్తంలో రూ.225.23 కోట్ల నగదు రూపంలో ఉండగా, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, ఓటర్లకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ.52.41 కోట్ల విలువైన వస్తువులు ఉన్నట్లు తెలిపింది.

Read Also: తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...