Uttam Kumar Reddy | పార్టీ మార్పుపై వార్తలపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

తాను కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై నల్గొండ ఎంపీ, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మారోసారి సీరియస్ అయ్యారు. తనపై గడిచిన రెండేళ్లుగా వ్యూహాత్మకంగా దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం వెనుక ఇంటి దొంగల హస్తం ఉందని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత వెనుకుండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. కావాలనే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కడానికే తన పై తప్పుడు ప్రచారం వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్(BRS) లో చేరబోతున్నారని పార్లమెంట్ సమావేశాలు ముగియగానే ఈ తంతు జరుగుతుందని సోషల్ మీడియాలో మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ ఈ ప్రచారం ఉత్తమ్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఉత్తమ్ శనివారం ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Read Also: తెలంగాణలో ప్రభుత్వం చచ్చిపోయింది: రేవంత్ రెడ్డి
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...