ప్రధాని సభలో సీఎం కేసీఆర్‌ కోసం ఎదురుచూశా: బండి సంజయ్

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని సభ అనంతరం బండి మీడియాతో మాట్లాడారు. ప్రధాని కార్యక్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో సీఎం కేసీఆర్‌ కోసం ఎదురుచూశామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ ఆటంకం అని విమర్శించారు. కేసీఆర్‌ కోసం ప్రోటోకాల్‌ ప్రకారం చెయిర్‌ కూడా వేశామని అన్నారు. సన్మానించేందుకు శాలువ కూడా పట్టుకొచ్చామన్నారు. ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్‌ ఎందుకు రాలేదని, సీఎం షెడ్యూల్‌ను బయట పెట్టాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

- Advertisement -

తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కావడానికి దేశ ప్రధాని, రైల్వే మినిస్టర్‌తో బీజేపీ(BJP) పార్టీ నాయకులంతా హాజరయ్యారని రాష్ట్ర ముఖ్యమంత్రి రాలేదని చెప్పుకొచ్చారు. దీనికి జ్వరం వచ్చిందని అంటారా.? కోవిడ్‌ వచ్చిందని అంటారా? అంటూ బండి(Bandi Sanjay) ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి కారణం ఏంటో తెలంగాణ ప్రజానికి కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు.

Read Also: ఆ పనులకు ఆటంకం కలిగించొద్దు.. బీఆర్ఎస్‌ సర్కార్‌కు ప్రధాని స్వీట్ వార్నింగ్!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...