BJP అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం: Amit Shah

-

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అందించి వారి హక్కును వారికి దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. చేవెళ్లలో ఆదివారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో తొమ్మిదేండ్లుగా అవినీతి ప్రభుత్వం కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రజలంతా చూస్తున్నారని, కేసీఆర్ ఫ్యామిలీ(KCR Family)కి జైలు ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా? వద్దా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ఇక్కడ చేసే నినాదాలు ఢిల్లీలో ఉన్న ప్రధాని మోడీ(PM Modi) వరకు వినిపించాలని వారిలో జోష్ నింపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని జోస్యం చెప్పారు.

- Advertisement -

కేసీఆర్(KCR), బీఆర్ఎస్‌(BRS)కు రోజులు దగ్గరపడ్డాయని, వారి అవినీతిపై ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. ప్రశ్నపత్రాల లీక్ పేరిట తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)ని జైల్లో వేశారని, అంత మాత్రాన తమ నేతలు భయపడుతారనుకున్నారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెవులు తెరిచి వినాలని, తమ నేతలు ఎన్నటికీ భయపడేవారు కారన్నారు. ఒక్కో కార్యకర్త కేసీఆర్ సర్కార్‌ను గద్దె దింపే వరకు పోరాడుతారని స్పష్టం చేశారు. బండి సంజయ్‌ని జైలులో వేసి కనీసం 24 గంటలు ఉంచలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇక్కడి పోలీసులు కూడా పూర్తిగా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రం అందించే నిధులు, పథకాలను కిందిస్థాయి వరకు అందకుండా బీఆర్‌‌ఎస్ నేతలు దోచుకుంటున్నారని షా(Amit Shah) ఆరోపించారు.

Read Also: రేవంత్ రెడ్డి కన్నీళ్లపై బండి సంజయ్ సెటైర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...