నాపై చేస్తున్న కుట్రలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే రాజయ్య

-

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ లేడీ సర్పంచ్‌పై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్‌ నాయకుడితో ఎమ్మెల్యే రాయబారం పంపడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా.. దీనిపై రాజయ్య స్పందించారు. ప్రజల్లో తనకున్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలు చేస్తున్నారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలను తిప్పి కొడతానని స్పష్టం చేశారు. జరిగిన విషయాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను ఖండించారు. తానంటే గిట్టనివారురాజకీయం ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -
Read Also: ట్రాన్స్‌జెండర్లపై ఆంక్షలు.. రోడ్డుమీద కనిపిస్తే 6 నెలలు జైలు శిక్ష

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...