YS Sharmila |యువతను బలిపశువులను చేసిన దుర్మార్గుడు కేసీఆర్ కాదా?

-

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం ఓ పోస్టు పెట్టారు. దేశంలో ఎంప్లాయ్‌మెంట్ పాలసీ తీసుకురావాలంటున్న మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని వైఎస్ఆర్టీపీ(YSRTP) షర్మిల ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలకు డిజిటల్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఐటీ మంత్రిగా మీ వైఫల్యం కాదా? అని నిలదీశారు. యువతను బలిపశువులను చేసింది సీఎం కేసీఆర్ అని, అదే యువత ఉద్యోగ ఆకాంక్షలను పాతరేసింది కేటీఆర్(KTR) అని పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షలు రాయొద్దని, ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.

- Advertisement -

తొమ్మిదేళ్లుగా ఒక్క గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని దద్దమ్మ కేసీఆర్(KCR) కాదా? అని పేర్కొన్నారు. కొలువులు ఇవ్వకుండా వందలాది మంది నిరుద్యోగుల ఉసురుతీసిన ఘనత కేసీఆర్‌ది కాదా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న ఒక కుటుంబాన్ని అయినా పరామర్శించారా? అని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ యువతను వంచించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్‌కు సిగ్గుంటే ముక్కునేలకు రాసి, యువతకు క్షమాపణ చెప్పాలన్నారు. లక్షా 91 వేల ఖాళీలకు నోటిఫికేషన్‌లు ఇచ్చి, నిరుద్యోగ భృతి అమలు చేయాలని షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు.

Read Also: పవన్ కల్యాణ్ సీఎం అయితే జరిగేది అదే.. నాగబాబు కీలక వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...