అపార్ట్‌ మెంట్‌ లో భారీ అగ్నిప్రమాదం.. 58 మంది దుర్మరణం

-

దక్షిణాఫ్రికా(South Africa)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జోహెన్స్‌ బర్గ్‌ లోని ఓ అపార్ట్‌ మెంట్‌లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా 58 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 43 మంది గాయపడినట్లు అత్యవసర సేవల ప్రతినిధి రాబర్ట్‌ ములౌద్జీ వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. మంటలు అదుపులోకి వచ్చాయని, అయితే భవనమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకునే అవకాశం ఉందని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ భవనంలో ఎంతమంది నివసిస్తున్నారనే అంశంపై కూడా స్పష్టత లేదని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...