రిషిసునాక్ బ్రిటన్ ప్రధాని అవ్వడానికి నా కూతురే కారణం: సుధామూర్తి

-

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి సతీమణి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత సుధామూర్తి(Sudha Murthy) తన కుమార్తె అక్షతామూర్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె భార్యలు భర్తలను ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్లగలరో అని ఓ ఉదాహరణ చెప్పారు. తన భర్తను తాను వ్యాపారవేత్తగా మారిస్తే.. తన కుమార్తె ఆమె భర్తను బ్రిటన్ ప్రధానిని చేసిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిటన్ ప్రధాని రిషిసునాక్‌(Rishi Sunak) అక్షతా మూర్తి(Akshata Murthy)ని 2009లో వివాహం చేసుకున్నారు. కాగా సుధామూర్తి(Sudha Murthy) పలు అనాథాశ్రమాలు నెలకొల్పడంతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌ రూమ్స్, లైబ్రరీ వసతులు కల్పించారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: ఫ్రైడ్ ఫుడ్, లాగించేస్తున్నారా? అధ్యయనంలో ఏం తేలింది?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...