కరోనా కూడా చైనా కుట్రే టీమిండియా క్రికెటర్…

కరోనా కూడా చైనా కుట్రే టీమిండియా క్రికెటర్...

0
33

భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి చూస్తుంటే కరోనా వైరస్ కూడా చైనా కుట్రే అనిపిస్తోందని టీమిండియా క్రికెటర్ సురేస్ రైనా అనుమానం వ్యక్తం చేశారు… గల్వాన్ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందడంతో దేశ వ్యాప్తంగా చైనా వ్యతిరేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి దీనిపై సురేష్ రైనా స్పందించారు…

ప్రపంచంపై అదిపత్యం చెలాయించేందుకు చైనానే కరోనా వైరస్ సృష్టించిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.. భారత్ పై దాడి చేసిన డ్రాగన్ దేశం మన డబ్బుతో నడవకూడదని చైనా వస్తువులను నిషేదించాలని అన్నాడు..

భారత భూమిని కాపాడేందుకు దేశ సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు… అంతేకాదు భారత ప్రభుత్వ బీసీసీఐ అనుమతిస్తే సరిహద్దుల్లోకి వెళ్లి జవాన్లకు సాయం చేస్తామని ప్రతీ సైనికుడి వెంట యావత్తు దేశం ఉందని తెలియజేస్తామని అన్నారు…