భారత్- నమీబియా మ్యాచ్..కెప్టెన్‌గా కోహ్లీ చివరి టీ20 ఇదే!

India-Namibia match..This is Kohli's last T20 as captain!

0
85

టీ20 వరల్డ్ కప్ 2021లో టీమ్ ఇండియాకు అంతగా కలిసి రాలేదు. టోర్నీలో తొలి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో భారత కల చెదిరిపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో టీమిండియా జాతకం మారిపోయింది. సెమీ ఫైనల్ రేసు నుంచి టీమ్ ఇండియా దూరమైంది. టీ20 ప్రపంచకప్‌ 7వ ఎడిషన్‌లో గ్రూప్‌ దశలోనే భారత్‌ బోల్తా పడడం ఇది నాలుగోసారి.

నమీబియాతో మ్యాచ్‌కు ముందు భారత జట్టు తన ప్రాక్టీస్‌ను కూడా రద్దు చేసుకుంది. గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్‌ని నమీబియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆశిస్తోంది. భారత్ నమీబియా రెండూ సెమీ-ఫైనల్ రేసు నుంచి దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

నమీబియాతో జరిగే మ్యాచ్ టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్. అటువంటి పరిస్థితిలో, ఐసీసీ టోర్నమెంట్‌ను గెలుచుకునే చివరి అవకాశాన్ని కోల్పోవడంతో..టీ20 కెప్టెన్సీ కెరీర్‌ను అద్భుతమైన విజయంతో ముగించాలని ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు.

అంతర్జాతీయ టీ20 పిచ్‌లో భారత్, నమీబియా జట్లు గతంలో ఎప్పుడూ తలపడలేదు. అంటే ఈ రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి. అఫ్గానిస్థాన్‌ ఓటమి భారత ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నమీబియా జట్టు కూడా దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో తిరగబడాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.