నేడు మరో బిగ్ ఫైట్..పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌..

0
86

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమయింది. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఆనందింపచేసాయి. ఇప్పటికే 26 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 27 మ్యాచ్ లో తలపడానికి పంజాబ్‌ కింగ్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ మహారాష్ట్ర క్రికెట్‌ అసోషియేషన్‌ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు జరుగనుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

 పంజాబ్‌ కింగ్స్‌: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ , రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జె సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్