South Central Railway: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. 38 స్పెషల్ రైళ్లు

-

South Central Railway Announced 38 Special Trains to Sabamarimala: శబరిమల భక్తుల దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాలదారుల సౌకర్యార్థం ఏపీ,తెలంగాణ రాష్ట్రల నుంచి 38 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు డిసెంబరు, జనవరి నెలలో అందుబాటులోకి రానున్నాట్లు పేర్కొంది. కాగా.. రైళ్లు ఏయే తేదీల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తాయి అనే వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కొల్లాంకు డిసెంబర్ 5,12,19,26 తేదీల్లో రైళ్లను నడపనున్నారు. కొల్లాం నుంచి హైదరాబాద్‌‌కు వచ్చే ప్రయాణికుల కోసం డిసెంబర్ 6, 13, 20, 27 జనవరి 3, 10, 17 తేదీల్లో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపనుంది. సికింద్రాబాద్ – కొట్టాయం డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8. కొట్టాయం – సికింద్రాబాద్ డిసెంబర్ 4, 11, 18, 25 జనవరి 2, 9 తేదీల్లో నడపనుంది. నర్సాపూర్ నుంచి కొట్టాయంకు డిసెంబర్ 2, 9, 16, 30 జనవరి 6, 13 తేదీల్లో రైళ్లు నడవనున్నాయి. కొట్టాయం-నర్సాపూర్ డిసెంబర్ 3, 10, 17, 24, జనవరి 7, 14 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు (South Central Railway)అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...