MLA Seethakka |రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ భగ్గుమంటున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. కక్ష సాధింపులతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. మోడీ ప్రభుత్వ దోపిడీని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని స్పష్టం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది ఎంత వాస్తవమో.. ఈ దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కి ఆయన్ను ఆపాలేరన్నది కూడా అంతే వాస్తవమన్నారు.
ఇలాంటి కేసులు, బెదిరింపులకే కాదు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన కుటుంబం వాళ్లదని సీతక్క(MLA Seethakka) గుర్తు చేశారు. మహిళలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారన్నారు. మోదీ అన్న పేరున్న వాళ్లకు దురదృష్టమో, అదృష్టమో.. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అని అంటే.. రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎంపీగా అనర్హత వేటు వేయించారని మండిపడ్డారు.
Read Also: రాహుల్ కంటే ముందు అనర్హత వేటుపడిన పొలిటీషియన్స్ వీళ్లే..!
Follow us on: Google News, Koo, Twitter