కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసిన షర్మిల

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 136 స్థానాల్లో గెలుపుతో అధికార పీఠాన్ని దక్కించుకుంది. గెలుపు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలకే దక్కుతుందని అందరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ గెలుపు వెనుక పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) ముఖ్యభూమిక పోషించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారాస్త్రం వరకు అన్నింటిలోనూ దిశానిర్దేశనం చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా పార్టీలకతీతంగా డీకే శివకుమార్‌ను అభినందించారు. డీకే ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila).. డీకే శివమార్‌ను కలిశారు. ఇవాళ(మే 29) ఉదయం బెంగళూరు వెళ్లిన షర్మిల డీకే నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని షర్మిల(YS Sharmila) అభినందించారు. ఈ క్రమంలో YSRతో ఉన్న సాన్నిహిత్యాన్ని డీకే శివకుమార్ గుర్తుచేశారు.

- Advertisement -
Read Also:
1. జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం సక్సెస్
2. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...