రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేళ ప్రొ.కోదండరాం కీలక వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్(BRS) సర్కార్ పై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెడుతూన్నారని విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్బంగా ఆయన నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ.. ఆత్మ బలిదానాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ.. గతాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ మనం ఆశించిన తెలంగాణ కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ఎంతో మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్నారని, భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పెద్ద ఎత్తున జరిగిన పోరాటం తెలంగాణ ఉద్యమం అని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు కోదండరాం(Kodandaram) తెలిపారు.

Read Also:
1. కేసీఆర్ సర్కార్ కు RS ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్
2. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గవర్నర్ దత్తాత్రేయ సీరియస్!
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Congress Manifesto | లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల లోక్‌సభ ఎన్నికల కోసం...

Ys Avinash Reddy | వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఊరట

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్...