ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఏపీ వాసి మృతి 

-

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో(Coromandel Train Accident) ఏపీ వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురంకు చెందిన గురుమూర్తి మరణించాడని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. అలాగే తీవ్రంగా గాయపడిన మరికొంతమంది ఏపీ ప్రయాణికులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 141 మంది ప్రయాణికుల జాడ ఇంకా తెలియరాలేదు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో.. వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారింది.

- Advertisement -

ప్రమాదం జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో(Coromandel Train Accident) 482 మంది ఏపీ ప్రయాణికులు ఉండగా.. ఇందులో 267 మంది క్షేమంగా బయటపడ్డారు. 113 మంది ఫోన్లలో అందుబాటులో లేకుండా పోయారు. విశాఖ నుంచి 76 మంది, రాజమండ్రి నుంచి 9 మంది, విజయవాడ నుంచి వెళ్లిన 28 మంది ప్రయాణికుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఇక యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 28 మంది ప్రయాణికుల ఆచూకీ లభించలేదు. రెండు రైళ్లలో కలిపి 316 మంది ఆంధ్రా వాసులు క్షేమంగా బయటపడగా.. 141 మంది జాడ మాత్రం లభ్యం కాలేదు.

Read Also:
1. మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...