Gidugu Rudra Raju | గిడుగు రాజీనామా.. వైఎస్ షర్మిలకి రూట్ క్లియర్

-

ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు(Gidugu Rudra Raju) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) కి పంపించారు. వైఎస్ షర్మిలకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీలో కాంగ్రెస్ పతనమైంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా పార్టీ ఏమాత్రం కోలుకోలేదు. దీంతో నేతల్లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.

- Advertisement -

ఈ క్రమంలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఏపీ నేతల్లో ఆశలు చిగురించేలా చేసింది. ఇంకోవైపు షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ లో చేరటం శ్రేణుల్లో మరింత జోష్ పెంచింది. ఆమె స్వయాన సీఎం జగన్ చెల్లెలు కావడంతో పార్టీకి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. వైసీపీని వీడిన నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశిస్తున్నారు.

Read Also: ఇండిగో ఫ్లైట్ లో పైలట్ పై దాడి (వీడియో)
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...