Mood of the Nation | ఏపీలో తెలుగుదేశం పార్టీదే విజయం.. ప్రముఖ మీడియా సర్వేలో స్పష్టం..

-

Mood of the Nation | దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థలు జనం నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రముఖ జాతీయ మీడియా ‘ఇండియా టుడే’ సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట సర్వే నిర్వహించింది.

- Advertisement -

Mood of the Nation | ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం అందుకోబోతోందని ఈ సర్వేలో తేలింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 17 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని తెలిపింది. ఇక అధికార వైసీపీ కేవలం 8 స్థానాలకే పరిమితం కానుందని పేర్కొంది. ఓట్ల శాతం పరిశీలిస్తే టీడీపీకి 45 శాతం, వైసీపీకి 41.1 శాతం, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ కు 2.7 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. దీంతో తెలుగు తమ్ముళ్లలో జోష్‌ పెరిగింది. సర్వే రిపోర్టును సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 10 ఎంపీ సీట్లు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెరో 3 సీట్లు, ఎంఐఎం పార్టీకి ఓ సీటు వస్తాయని చెప్పింది.

Read Also: ఎన్నికల ‘శంఖారావం’కు సిద్ధమైన లోకేశ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...