Revanth Reddy | కేటీఆర్‌ జైలులో చిప్పకూడు తింటాడు.. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..

-

తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తొలిసారిగా స్పందించారు. కేటీఆర్(KTR) వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానమిచ్చారు. అహంకారంగా మాట్లాడితే జైలులో చిప్పకూడు తింటాడని హెచ్చరించారు.

- Advertisement -

“గత ప్రభుత్వంలో భార్యభర్తల ఫోన్ కాల్స్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ అంటున్నారు.. మంది సంసారాల్లో వేలు పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది. కేటీఆర్ తాగుబోతులా బరితెగించి మాట్లాడుతున్నారు. ఒకట్రెండు ఫోన్ల సంభాషణ విన్నాం.. వింటే ఏమవుతుందని సిగ్గు లేకుండా అంటున్నారు. అలా ఫోన్ సంభాషణలు వింటే చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది చట్టప్రకారం చర్యలు ఉంటాయి. ఇలాంటి పొరపాట్లు చేయ్యొద్దని చెప్పినా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇప్పుడు చేసిన తప్పులకు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు” అని రేవంత్ తెలిపారు.

కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డిసిపి రాధా కిషన్ రావులను అరెస్ట్ చేశారు.

Read Also: పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...