తెల్లవారేసరికి టీడీపీపై ప్రేమ పుట్టుకొచ్చిందా.. కోటంరెడ్డిపై మంత్రులు సెటైర్లు

-

ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రస్తావించిన వెంటనే నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావిస్తూ ప్లకార్డుతో సభలో నిలబడ్డారు. దీంతో క్వశ్చన్ అవర్‌లో మెంబర్ మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. కోటంరెడ్డి ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పాలని స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయినా.. కోటంరెడ్డి ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. నిరసనను కంటిన్యూ చేశాడు. దీంతో మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి స్పందిస్తూ… సమస్యలు లేని సోసైటీ ఉండదని.. సమస్యలను ఏ వేదికలో తీర్చుకోవాలనేది చూడాలన్నారు. గవర్నర్ ప్రసంగం జరగాల్సిన సమయంలో వ్యక్తిగత అంశాలు అడగడం సమంజసం కాదని తెలిపారు. కోటంరెడ్డి ఇబ్బందులను రిప్రజెంట్ చేస్తే తాము స్పందిస్తామన్నారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన హౌస్‌ను ఇబ్బందిపెట్టి ప్రజల దృష్టిలో పడాలని చూస్తున్నారన్నారు. అటు టీడీపీ సభ్యులకు కోటంరెడ్డిపై, కోటంరెడ్డికి టీడీపీపై తెల్లారేసరికి ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: ప్రశ్నాపత్రాలు లీక్ వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై సీరియస్‌

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Avinash Reddy | అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు...

Pawan Kalyan | సీఎం జగన్‌పై దాడి ఘటనకు ఆ నలుగురిని విచారించాలి: పవన్ కల్యాణ్

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి(YS Jagan)పై జరిగిన రాయి దాడి...