అప్పుడే నేను ముఖ్యమంత్రి జగన్‌ను అభినందిస్తా: కోటంరెడ్డి

-

జగన్ సర్కార్‌పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం ఉదయం సచివాలయం వద్దనున్న అగ్నిమాపక కేంద్రం వద్ద కోటంరెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలో‌ని సమస్యల ప్లకార్డులను పట్టుకొని ప్రదర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రిని అభినందిస్తానన్నారు. 4 ఏళ్ళు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయే గళం వినిపిస్తున్నానన్నారు. మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డుల పట్టుకొని నిలబడి ప్రదర్శిస్తూనే ఉంటానన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy)కి పచ్చ కండువా కప్పి రాజధాని రైతులు మద్దతు తెలిపారు. ప్లకార్డు ప్రదర్శన వద్దంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు.

- Advertisement -
Read Also: తెల్లవారేసరికి టీడీపీపై ప్రేమ పుట్టుకొచ్చిందా.. కోటంరెడ్డిపై మంత్రులు సెటైర్లు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Loksabha Polling: ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం...

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...