Ambati Rambabu | పవన్ కళ్యాణ్ ఆ విషయం కార్యకర్తలకు చెప్పాలంటూ అంబటి డిమాండ్

-

రిపబ్లిక్ డే రోజు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఒత్తిడి చేస్తున్నారని చెప్పి పొత్తుధర్మం పాటించకుండా చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారని ఆరోపించారు. అందుకే మాపై కూడా ఒత్తిడి ఉందని, మేం కూడా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. ఇదే అదునుగా భావించిన వైసీపీ నేతలు అటు జనసేన(Janasena)ను, ఇటు టీడీపీ(TDP)ని ఓ ఆట ఆడుకుంటున్నాయి. వెన్నుపోటు చంద్రబాబుకు కొత్తేమీ కాదని విమర్శిస్తున్నాయి. ఇక పొత్తుధర్మం పాటించకపోయినా చంద్రబాబుతోనే పవన్ కళ్యాణ్ ఎందుకు అంటగాకుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) జనసేనానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

 

- Advertisement -

పొత్తుధర్మం పాటించకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు(Chandrababu)తో కలిసి ఎందుకు నడుస్తున్నారో జనసేన కార్యకర్తలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా, ప్యాకేజీ ధర్మాన్ని పాటిస్తున్నాడేమో.. అందుకే చంద్రబాబు వెంటే పవన్ ఉంటున్నాడని అంబటి(Ambati Rambabu) ఎద్దేవా చేశారు. పొత్తుధర్మమే కాదు అసలు ఏ ధర్మము పాటించని వ్యక్తి ఈ దేశ రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబేనని విమర్శించారు. బాబు రెండు సీట్లు ప్రకటిస్తే.. పవన్ రెండు సీట్లు, బాబు 10 సీట్లు ప్రకటిస్తే.. పవన్ 10 సీట్లు ప్రకటిస్తారా అంటూ ప్రశ్నించారు. ఏదో తేడా వచ్చింది కాబట్టి పవన్ ఇలా మాట్లాడారు కానీ, ఆయన ఎప్పుడూ చంద్రబాబు బాటలోనే నడుస్తారని అన్నారు.

Read Also: జనసేన పోటీ చేసే తొలి రెండు స్థానాలు ప్రకటించిన పవన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...