Atchannaidu: బీసీ ద్రోహి.. జగన్‌ రెడ్డి

-

Atchannaidu fires on CM Jagan: టీడీపీ నేత అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు. జగన్‌ రెడ్డి బీసీ ద్రోహి అని దుయ్యబట్టారు. 34 వేల కోట్ల బీసీ నిధులను సీఎం జగన్‌ దారి మళ్లించారని ఆరోపించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లలలో కోత పెట్టి.. 16,800 రాజ్యాంగబద్ధ పదవులను బీసీలకు దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. 26 బీసీ నేతలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దారుణ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 217తో మత్స్యకారుల భవిష్యత్తుకు ఉరితాడు బిగించారన్నారు. విదేశీ విద్య, పెళ్లి కానుకలను బీసీలకు దూరం చేశారని అచ్చెన్న అన్నారు. బీసీలకు చెందిన 8వేల ఎకరాల ఎసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...