Bhumana Karunakar Reddy: తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన

-

Bhumana Karunakar Reddy: సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద నుంచి గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా నగర పాలక సంస్థ కార్యాలయం వరకు మహా ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలనేదే తమ ఆకాంక్ష అని… ప్రజలనాడి తెలుసుకోకుండా మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేసిన విషప్రచారాన్ని తిరుపతి ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. చంద్రబాబు గుండెల్లో నిద్రపోయేలా తిరుపతి ఆత్మ గౌరవ సభ జరిగిందన్నారు. చంద్రబాబు ఈ గడ్డపై పుట్టి కూడా సీమకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడుకు కృష్ణాజలాలు రాకుండా అడ్డుకున్నాడని చంద్రబాబు పై Bhumana Karunakar Reddy ఆగ్రహంవ్యక్తం చేశారు.

- Advertisement -

Read also: ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి భద్రత పెంచిన ప్రభుత్వం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...