Chandrababu: బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా?

-

Chandrababu fires on ap cm Jagan in Twitter: నరసాపురం సీఎం పర్యటనలో సోమవారం నిర్వహించిన సభ వద్ద పోలీసులు బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను, నల్ల చున్నీలు ధరించిన యువతులు, మహిళలనూ అనుమతించలేదు. చున్నీలు తీసేసి వెళ్లాలని పోలీసులు వారికి చెప్పారు. ఈ ఘటన పై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మంగళవారం స్పందించారు. ‘‘ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయించివేయడం దారుణం. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? గొడుగులు చూసి కూడా ఎందుకు భయం! ఇదంతా పోలీసు భద్రత కాదు… జగన్ రెడ్డి అభద్రత.’’ అని చంద్రబాబు ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. కాగా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం జగన్ బయటకు రారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న...

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...