‘రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే’

-

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా(Minister Roja) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని, ఆయన ఒక సైతాన్ అంటూ ఘాటుగా స్పందించారు. జగన్(Jagan) నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని చంద్రబాబు(Chandrababu) మూడు పర్యాయాలు అవకాశం ఇచ్చినా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కొత్తగా ఇప్పుడు మళ్లీ అవకాశం ఇచ్చినా.. చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఏ సీఎం చేయలేని విధంగా జగన్ ఏపీని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

- Advertisement -

2024 ఎన్నికల్లో తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) పార్టీలకు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని రోజా(Minister Roja) సవాల్ విసిరారు. ఇరు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే పవన్ కల్యాణ్(Pawan Kalyan) లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి వచ్చిన వైసీపీ(YCP)ని ఓడించలేరని రోజా ధీమా వ్యక్తం చేశారు. మంచి పరిపాలన అందిస్తేనే ఓటు వేయమని అడిగే ధైర్యం ఒక్క సీఎం జగన్‌కి మాత్రమే ఉందని అలాంటి సీఎం జగన్‌ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు.

Read Also: వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుని తల్లిపై వివేకా లైంగిక వేధింపులు?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...