ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేస్తాయి: పవన్

-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మంగళగిరి జనసేన జాతీయ పార్టీ కార్యాలయంలో జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశానికి హాజరైన పవన్ పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ నాయకుల మదం దించేందుకు టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కలిసి పోటీచేస్తామని స్పష్టంచేశారు. ఈసారి త్రిముఖ పోటీలో బలికావడానికి సిద్ధంగా లేనని పేర్కొన్నారు. ఏ పార్టీపై తనకు ప్రేమ, ద్వేషం లేవని.. కేవలం రాజకీయ వ్యూహాం మాత్రమే ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

పొత్తులను తక్కువ అంచనా వేయవద్దని.. పొత్తుల వల్లనే బీఆర్ఎస్(BRS) పార్టీ జాతీయ పార్టీగా ఎదిగిందన్నారు. వైసీపీ(YCP)ని గద్దె దించడమే తన లక్ష్యమని.. ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవి గురించి నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే ముందస్తు ఎన్నికల గురించి చెబుతూ ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని జోస్యం పవన్(Pawan Kalyan) చెప్పారు. జూన్ నుంచి జనసేన ప్రచారం మొదలుపెట్టనుందని జనసేనాని వెల్లడించారు.

Read Also: AP ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...