త్వరలోనే వారాహితో జనాల్లోకి రానున్న జనసేనాని 

-

Varahi Tour |జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే రాజకీయ కురుక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన ఇకపై జనాల్లోనే ఉండనున్నారు. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటివారం నుంచే వారాహి వాహనం ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచే పవన్ ప్రచారం మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Varahi Tour |ఈ మేరకు ఇప్పటికే ఆ జిల్లాల నేతలతో పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయి వారాహి రూట్ మ్యాప్‌పై చర్చించారు. త్వరలోనే పవన్ పర్యటన తేదీలు ఖరారు చేయనున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు ఉండనున్న క్రమంలో ఆ పార్టీ నేతలతోనూ చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పట్టుదలతో ఉన్న జనసేనాని అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతోనే జనాల ముందుకు రానున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Read Also:
1. హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదు: గవర్నర్ తమిళిసై 
2. పెళ్లి పీటలెక్కబోతున్న మెగా హీరో.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...