ఎవరైనా సరే చంద్రబాబు జోలికి వస్తే తగ్గేదేలే.. ఇచ్చి పడేస్తాం: బుద్ధా 

-

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బుద్దా వెంకన్న(Buddha Venkanna) తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు(Chandrababu) వద్ద 9 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన సీతారామా.. ఆయన గురించి మాట్లాడేదంటూ మండిపడ్డారు. చంద్రబాబు సెక్యూరిటీ తీసేస్తే.. చంపేస్తాం.. అంటే చూస్తూ కూర్చుంటామా అని హెచ్చరించారు.

- Advertisement -

ఇప్పటివరకు కృష్ణా జిల్లా వైసీపీలోనే ఊర కుక్కలు ఉన్నాయని అనుకున్నామని.. ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఉన్నాయని తెలుస్తోందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని(Thammineni Seetharam)కి దమ్ముంటే తాను చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. ఇక అధికారం ఉంది కదా అని చంద్రబాబు ఇంటి మీదకు ఎవరైనా వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అది సీఎం జగన్ అయినా సరే ఊరుకునేది లేదన్నారు. చంద్రబాబు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని బుద్దా వెంకన్న(Buddha Venkanna) వెల్లడించారు.

Read Also:
1. త్వరలోనే వారాహితో జనాల్లోకి రానున్న జనసేనాని 
2. మరోసారి మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసారి టార్గెట్ పోలీసులు!
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Loksabha Polling: ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం...

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...