యర్రగొండపాలెంలో రాళ్ల దాడి ఘటనపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు!

-

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం(Yerragondapalem)లో శుక్రవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా జరిగిన రాళ్ల దాడిని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన రాళ్ల దాడి, తదిరత నిరసన ఘటనలను గవర్నర్ దృష్టికి వెళ్లనుంది. ఇప్పటికే దాడి ఘటన వివరాలను ఈమెయిల్ ద్వారా రాజ్ భవన్ పంపిన నేతలు.. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలను ప్రస్తావించనున్నారు. ఎన్ఎస్జీ భద్రతలో ఉన్న చంద్రబాబుపై గతేడాది నవంబర్ లోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. రాళ్లదాడిలో భద్రతాధికారి తలకు కూడా గాయాలు కావడంతో ఈ ఘటనను టీడీపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు.

- Advertisement -

మరోవైపు చంద్రబాబు(Chandrababu)పై జరిగిన రాళ్ల దాడిని టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. మంత్రి సురేష్(Audimulapu Suresh) ఓ రౌడీ లాగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇలాంటి దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని.. అధికారమదంతో ఎగిరెగిరి పడుతున్న వైసీపీ నేతలకు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

Read Also: ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ అంటున్న టైమ్స్ నౌ సర్వే

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...