Times Now Survey |ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ అంటున్న టైమ్స్ నౌ సర్వే

-

Times Now Survey |ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. అలాగే ఏపీలో అధికార వైసీపీకి 24-25 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అంటే ఆంధ్రలో ఉన్న 25 ఎంపీ స్థానాలను గెలిచి వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగుతుందని టైమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో వెల్లడైంది.

- Advertisement -

ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి 292-338 సీట్లు వస్తాయని.. కాంగ్రెస్ కూటమికి 106-144 స్థానాలు రావొచ్చని చెప్పింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీకి 20-22, ఏపీలో వైసీపీకి 24-25, ఒడిశాలోని బీజేడీకి 11-13 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. ఈ సర్వేలో మొత్తం 42శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పినట్లు ఆ సంస్ధ వెల్లడించింది.

Times Now Survey |ఇక దేశంలోనే శక్తివంతమైన ప్రధాని అభ్యర్థిగా మోదీకి 64శాతం, రాహుల్ గాంధీకి 13శాతం, కేజ్రీవాల్ 12, నితీశ్‌ కుమార్ 6, కేసీఆర్ 5శాతం ఓట్లు దక్కించుకున్నారు. 2024 ఎన్నికలకు ప్రతిపక్షాల కూటమికి సారథిగా రాహుల్ గాంధీకి 29శాతం మంది మద్దతు ఇచ్చారు.

Read Also: వైసీపీలో చేరబోతున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...