వైసీపీ ఎంపీ Avinash Reddy ని విచారించిన సీబీఐ

-

Avinash Reddy |వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్​రెడ్డి శుక్రవారం మరోసారి హైదరాబాద్‌లోని సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు ఆయనను నాలుగు గంటలపాటు విచారించారు. అనంతరం బయటకు వచ్చిన అవినాష్​రెడ్డి(Avinash Reddy) మీడియాతో మాట్లాడారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని అన్నారు. వివేకా హత్య జరిగిన రోజున మార్చురీ వద్ద ఏం మాట్లాడానో ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ వ్యక్తి టార్గెట్‌గా నడుస్తున్నట్టు అనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. మరోసారి విచారణకు రావాలని సీబీఐ(CBI) అధికారులు చెప్పలేదన్నారు. హత్యకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని తెలిపినట్టు పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తప్పుబట్టారు. ఇది సీబీఐ విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

- Advertisement -
Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...