ఈ పథకంతో రూ.2 లక్షల ఆర్థిక సదుపాయం..పూర్తి వివరాలివే..

0
34

దేశ వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. ఈ పథకాల మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారు. తాజాగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇ-శ్రమ్ కార్మికుల భీమా పథకంలో దేశవ్యాప్తంగా దాదాపు 28 కోట్ల మంది ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని కేంద్రం తెలిపింది.

ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు eshram.gov.in వద్ద ఇ-శ్రమ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 16 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల అసంఘటిత రంగంలో పనిచేసే భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులు పోర్టల్‌లో నమోదు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులు రూ. 2 లక్షల ప్రమాద బీమా కవరేజీని పొందుతారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.2 లక్షలు అందజేస్తారు. కార్మికుడు పాక్షికంగా వికలాంగుడైనట్లయితే అతనికి రూ. లక్షకు పైగా భీమాను పొందవచ్చు.