మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్..ఇకపై 28 రోజులు కాదు..30 రోజులు!

Good news for mobile users..not 28 days anymore..30 days!

0
32

టెలికాం సంస్థలకు భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) భారీ షాక్ ఇచ్చింది. మొబైల్ యూజర్లకు మేలు జరిగేలా సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. తద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ విషయంలో గుడ్​ న్యూస్​ చెప్పినట్లయ్యింది.

ఇకపై ప్రతి సంస్థ 28 రోజులకు కాకుండా 30 రోజుల కాల పరిమితితో రీఛార్జ్ ప్యాక్ లను తీసుకురావాలని ఆదేశించింది. ప్రీపెయిడ్ ప్యాక్ ల విషయంలో వ్యాలిడిటీని పెంచాల్సిందేనని టెలికాం సంస్థలకు తేల్చి చెప్పింది. గతంలో మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభించేవి. అయితే, ఆ తర్వాత వీటిని అన్ని టెలికాం సంస్థలు 28 రోజులకు తగ్గించాయి.

దాని ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఇది యూజర్లకు పెను భారంగా మారుతోంది. ఈ క్రమంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో.. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌‌లను తీసుకురావాలని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్‌-1999కి మార్పులు చేస్తూ ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్లు ఉండాలని ట్రాయ్ తెలిపింది. ప్రతి నెలా ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాకుండా రెండు నెలల్లోపు ఆదేశాలను అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది.