ఏపీ ప్రజలకు ఊరట..తగ్గిన కరోనా కేసులు..ఎన్ని నమోదయ్యాయంటే?

0
39

ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11,573 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,24,571  చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో ముగ్గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 594 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,15,425 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 9445 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 40, 357 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,39 లక్షల కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కడప జిల్లాలో ఏకంగా ఇవాళ ఒక్క రోజే అత్యధికంగా.. 1942 కరోనా మహమ్మారి కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.