క్షమాపణలు చెప్పిన ఫేస్‌బుక్ సీఈవో..ఎందుకో తెలుసా?

0
42

సాంకేతిక కార‌ణాల‌తో వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌లు సోమ‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల వ‌ర‌కు నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగించినందుకు చింతిస్తూ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

ప్ర‌స్తుతం ఈ మూడు నెటిజ‌న్ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు. మీకు ఇష్ట‌మైన వ్య‌క్తుల‌తో స‌న్నిహితంగా ఉండ‌టానికి వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌పై ఎంత ఆధార‌ప‌డుతారో త‌మ‌కు తెలుసు అని..ఈ అంత‌రాయం క‌లిగించినందుకు క్ష‌మించండని మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కోరారు.

దీనితో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌కు భారీ న‌ష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల (మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్‌బుక్‌ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్‌లో డ్యామేజ్‌ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్‌ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది.

https://www.facebook.com/zuck?fref=nf