ఎయిర్‎టెల్ కస్టమర్లకు షాక్..!

Shock to Airtel customers ..!

0
32

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‎టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్​, అన్​లిమిటెడ్ వాయిస్ ప్యాక్​లు, మొబైల్ డేటా రీఛార్జ్​లపై ఉన్న ధరలపై 20-25 శాతం పెంచినట్లు తెలిపింది.

ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్​ ధర 25శాతం.. అన్​లిమిటెడ్ వాయిస్ బండిల్స్ ధర 20 శాతం పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వివరించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

కొత్త ధరలు దేశంలో 5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయని ఎయిర్​టెల్​ పేర్కొంది. కొత్త రేట్ల ప్రకారం వాయిస్ ప్లాన్స్ ధర ఇంతకుముందు రూ.79 కాగా ప్రస్తుతం రూ. 99కు చేరింది. 50 శాతం అధిక టాక్​టైం, 200 జీబీ మొబైల్ డేటా, సెకనుకు 1పైసా వాయిస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ గడువు 28 రోజులు ఉంది. ఈ పెంపు వల్ల ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయంరూ.200-300కు చేర్చాలని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది.